న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఇటీవలే ప్రారంభమైన ఆకాశ ఎయిర్లైన్స్ వివాదంలో చిక్కుకున్నది. ఎయిర్లైన్స్ వద్ద ఉన్న ప్రయాణికుల సమాచారం అనధికార వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్టు గుర్తించారు. దీంతో సమాచార గోప్యత ఉల్లంఘన జరిగినందుకు ఎయిర్లైన్స్ క్షమాపణలు తెలిపింది. అలాగే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సీఈఆర్టీ-ఇన్)కు సమాచారం అందించినట్టు పేర్కొన్నది. సాంకేతిక పొరపాటు కారణంగా కొందరు ప్రయాణికుల పేర్లు, లింగం, ఈ-మెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్ వంటి సమాచారం అనుకోకుండా కొందరు అనధికార వ్యక్తులు చూశారని తెలిపింది. అయితే వారి ప్రయాణ వివరాలు, పేమెంట్ వివరాలు ఎవరి చేతుల్లోకి వెళ్లలేదని స్పష్టం చేసింది.