CRPF | భద్రాద్రి కొత్తగూడెం : ప్రమాదవశాత్తు ఏకే 47 గన్ పేలి సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి చెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పూసగుప్ప 81వ బెటాలియన్లో బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
సీఆర్పీఎఫ్ డీఎస్సీ శేషగిరి రావు కింద పడిపోవడంతో.. ఆయన వద్ద ఉన్న ఏకే 47 ప్రమాదవశాత్తు పేలింది. దీంతో ఛాతి కింది భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించేలోగా శేషగిరి రావు ప్రాణాలు కోల్పోయారు. శేషగిరి రావు మృతిపట్లు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.