అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద స్వల్పంగా కొనసాగుతోంది. బుధవారం డ్యాంలోకి ఇన్ఫ్లో 10,997క్యూసెక్కులు ఉండగా,అవుట్ఫ్లో 10,576 క్యూసెక్కులు ఉంది.100.855 టీఎం సీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 99.778టీఎంసీల నీటి నిల్వ ఉంది.1633అడుగుల నీటి మట్టానికి గాను, ప్రస్తుతం 1632.72 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగ మోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు తగ్గుతున్నవరద
కర్ణాటక ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆర్డీఎస్ ఆనకట్టకు వరద తగ్గుతోంది. బుధవారం ఆర్డీఎస్ ఆన కట్టకు 7952క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా,7500 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోందని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ డేవిడ్ తెలిపారు.ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 8.9అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 452 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.