న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆపై వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకువస్తోందని ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (AIUDF) పేర్కొంది. ఉమ్మడి పౌరస్మృతి అంశం (యూసీసీ)పై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఏఐయూడీఎఫ్ విమర్శలు గుప్పించింది.
కేంద్ర ప్రభుత్వం యూసీసీని ఎలా తీసుకువస్తుందో తనకు అర్ధం కావడం లేదని, ఏ అంశం లేకపోవడంతో త్వరలో జరిగే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు కాషాయ పార్టీ యూసీసీని ముందకు తెస్తోందని ఏఐయూడీఎఫ్ ప్రధాన కార్యదర్శి అమినుల్ ఇస్లాం ఆరోపించారు. బీజేపీ ముస్లింలను టార్గెట్ చేస్తోందని దుయ్యబట్టారు. తమ పార్టీ యూసీసీకి వ్యతిరేకమని, దీన్ని ఎప్పటికీ తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కూరగాయల ధరల పెరుగుదలపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కులం, మతం ఆధారంగా బీజేపీ ప్రజలను విభజిస్తోందని మండిపడ్డారు. ఈశాన్య ప్రాంతంలో తనకు అనుకూల పరిస్ధితి లేకపోవడంతో వర్గాల మధ్య అంతరం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కూరగాయల ధరల పెరుగుదలకు మియా ముస్లింలు కారణమని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారని అమినుల్ ఇస్లాం గుర్తుచేశారు.
Read More :
Abhishek Bachchan | రాజకీయాల్లోకి అభిషేక్ బచ్చన్.. త్వరలో సమాజ్వాది పార్టీలో చేరిక..!