దేశ రాజధానిలో వాతావరణం చాలా దారుణంగా ఉంది. దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైంది. గాలి నాణ్యత సూచీ ( ఏక్యూఐ ) భారీగా పెరిగిపోయింది. నగరమంతా స్మోగ్తో కమ్మేసింది. మరోవైపు యమునా నదిలో కూడా కాలుష్యం పెరిగిపోయింది. దీంతో ఢిల్లీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.