న్యూఢిల్లీ : ఢిల్లీ-దుబాయ్ విమానంలో మహిళా స్నేహితురాలిని ఎయిర్ ఇండియా (Air India) పైలట్ కాక్పిట్లోకి అనుమతించిన ఘటనపై పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) దర్యాప్తును చేపట్టింది. ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన జరిగిందని సమాచారం.
భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తూ ఈ ఘటన చోటుచేసుకోవడంతో దర్యాప్తునకు ఆదేశించామని డీజీసీఏ వెల్లడించింది. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని డీజీసీఏ పేర్కొంది. మహిళా స్నేహితురాలిని కాక్పిట్లోకి అనుమతించిన పైలట్ను విధుల నుంచి తొలగించారా లేదా అనేది తెలియరాలేదు.
కాగా ఏప్రిల్ 18న ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గ్లాస్ డోర్స్లో పగుళ్లు కనిపించడంతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయారిటీ ల్యాండింగ్ను కోరారు. పుణే నుంచి ఈ విమానం బయలు దేరింది.