న్యూఢిల్లీ: భారత వాయుసేన (Indian Air Force) సత్తా మరింత పెరుగనుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఎగురగల తేలికపాటి హెలికాప్టర్లు నేడు ఇండియన్ ఎయిర్పోర్స్లో చేరనున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన తేలికపాటి పోరాట హెలికాప్టర్లను (Light Comat Helicopters -LCH) రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరిలు నేడు లాంఛనంగా వాయుసేనలో ప్రవేశపెట్టనున్నారు. ఈ చారిత్రక ఘటనకు రాజస్థాన్లోని జోధ్పూర్ వేదిక కానుంది.
రెండు ఇంజిన్లతో 5.8 టన్నుల బరువున్న ఈ హెలికాప్టర్లను ప్రధానంగా పర్వత ప్రాంతాల్లో మోహరించడానికి రూపొందించారు. శత్రు రాడార్లను బోల్తాకొట్టించే స్టెల్త్ సామర్థ్యం వీటికి ఉన్నది. నేలను బలంగా తాకినప్పటికీ తట్టుకోగలిగేలా దృఢమైన ల్యాండింగ్ గేరును వీటికి అమర్చారు. 5 వేల మీటర్ల ఎత్తులో కూడా ఇవి టేకాఫ్ కాగలవు. తక్కువ బరువున్న ఈ హెలికాప్టర్లు వాయుసేన, ఆర్మీ అవసరాలను తీర్చగలుగుతాయి.
I would be in Jodhpur, Rajasthan tomorrow, 3rd October, to attend the Induction ceremony of the first indigenously developed Light Comat Helicopters (LCH). The induction of these helicopters will be a big boost to the IAF’s combat prowess. Looking forward to it. pic.twitter.com/L3nTfkJx5A
— Rajnath Singh (@rajnathsingh) October 2, 2022