చిత్రపురి కాలనీలో మిగిలిన ఇళ్ల నిర్మాణాలను మరో ఆరు నెలల్లో పూర్తి చేస్తామని అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని అన్నారు. కాలనీ ఎంఐజీ ప్రాంగణంలో కమిటీ సభ్యులు, ఆఫీస్ బేరర్స్తో కలిసి ఆయన పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ…‘చిత్రపురిలో అవినీతి అంటూ కొందరు సభ్యులు చేస్తున్న రాద్దాంతం వల్ల నిర్మాణాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
చిత్రపురి అభివృద్ధే లక్ష్యంగా మా కమిటీ పనిచేస్తున్నది. మరో ఆరు నెలల్లో మిగిలిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. త్వరలోనే మరో 430 మంది సినీ కార్మికులకు కొత్తగా ఫ్లాట్స్ కేటాయించబోతున్నాం. ఇక్కడి పిల్లల చదువుల కోసం చిత్రపురి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేశాం. త్వరలో ఆస్పత్రిని హీరో చిరంజీవి ఏర్పాటు చేయబోతున్నారు’ అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ మహానంద రెడ్డి, కార్యదర్శి కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.