న్యూఢిల్లీ: ఓ వర్గం వారిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల్ని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. హైదరాబాద్లో శాంతి వాతావరణాన్ని బీజేపీ కాంక్షించడం లేదని ఆయన అన్నారు. మహమ్మద్ ప్రవక్త, ముస్లింలను బీజేపీ ద్వేషిస్తుందని అసద్ ఆరోపించారు. భారత్లో ఉన్న సామాజిక భినత్వాన్ని నాశనం చేయాలని బీజేపీ చూస్తోందని ఆయన పేర్కొన్నారు. తమతో పోరాటం చేయాలనుకునేవాళ్లు రాజకీయ పోరాటం చేయాలని, కానీ ఇలా కాదు అని అసద్ అన్నారు. ఒకవేళ ప్రధాని మోదీ, బీజేపీ ఆ వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వకుంటే అప్పుడు వాళ్లు రియాక్ట్ కావాలన్నారు. సర్ తన్ సు జుదా నినాదాలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలెవ్వరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదు అని ఎంపీ అసద్ అన్నారు.
ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీ రాజాసింగ్ను ఇవాళ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేస్బుక్లో ఓ వీడియో పోస్టు చేసిన రాజా సింగ్ దాంట్లో ఓ వర్గం వారిపై కామెంట్ చేశారు. దబీర్పురా పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఐపీసీలోని 153, 153A, 188, 121, 295A, 298, 505 (1) (B) (C), 505 (2), 506 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.