ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 15: పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని 12వ వార్డులోని న్యూహౌసింగ్బోర్డుజోన్ -1లో రూ.30 లక్షలతో చేపడుతున్న పార్కు అభివృద్ధి పనులకు మంగళవారం భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. హరితహారం కింద నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్య త అందరి పై ఉందన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పవన్నాయక్, మున్సిపల్ కమిషనర్ శైలజ, ఈఈ వెంకట శేషయ్య, డీఈ తిరుపతి, నాయకులు శ్రీకాంత్, వినోద్రెడ్డి, విజయ్రావ్, రాజేశ్వర్, తిరుమలేశ్, సుభాష్ పాల్గొన్నారు.
రాష్ట్రంలోని మూడు క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఎంపిక పోటీలను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం స్పోర్ట్స్హాస్టల్ ఎంపిక పోటీల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రీడా పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. మండల స్థాయి ఎంపిక పోటీలు ఈనెల 20లోపు, జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఈనెల 24,25 తేదీల్లో జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో, మార్చి3న హైదరాబాద్లోని హకీం పేటలో రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయని వివరించారు. 8 క్రీడాంశాల్లో 4,5వ తరగతి విద్యార్థులను పరీక్షించి, మెరిట్ ఆధారంగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని వెల్లడించారు. వివరాలకు ఆయా మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, కౌన్సిలర్ జాదవ్ పవన్ నాయక్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, ఏటీడబ్ల్యూవో భాస్కర్, ఐటీడీఏ క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, హ్యాండ్బాల్ సంఘం జిల్లా కార్యదర్శి హరిచరణ్, టేబుల్టెన్నిస్ సంఘం అధ్యక్షుడు రాష్ట్రపాల్, ఎస్జీఎఫ్ కార్యదర్శి గుండి మహేశ్, క్రీడాకారులు పాల్గొన్నారు.