“అఖండ’, ‘పుష్ప’ చిత్రాలు పెద్ద విజయాల్ని సాధించి తెలుగు చిత్రసీమలో నూతనోత్సాహాన్ని నింపాయి. ఆ విజయపరంపరను మా సినిమా కొనసాగిస్తుందనే నమ్మకముంది” అని అన్నారు ఆది సాయికుమార్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘అతిథి దేవోభవ’. శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై రాజబాబు మిర్యాల, అశోక్రెడ్డి మిర్యాల నిర్మించారు. పొలిమేర నాగేశ్వర్ దర్శకుడు. నువేక్ష కథానాయిక. ఈ నెల 7న విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. నా పాత్రచిత్రణ నవ్యరీతిలో సాగుతుంది. కథ, కథనాలు విభిన్నంగా ఉంటాయి. సిధ్శ్రీరామ్ ఆలపించిన ‘బాగుంటుంది..’ పాటకు నాలుగు మిలియన్ల వీక్షణలు లభించాయి’ అని అన్నారు. ఆది కెరీర్లో బెస్ట్ సినిమా నిలుస్తుందని, శేఖర్చంద్ర బాణీలకు చక్కటి స్పందన లభిస్తున్నదని దర్శకుడు పొలిమేర నాగేశ్వర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్చంద్ర, ఛాయాగ్రహణం: అమర్నాథ్బొమ్మిరెడ్డి.