Prabhas adipurush movie | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఈయన నటించిన రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. మర్చి 11న ఈ చిత్రం విడుదలకానుంది. ఇప్పటికే ఆదిపురుష్ చిత్రం కూడా షూటింగ్ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రామాయణం కథను విజువల్ వండర్ గా అత్యంత భారీ బడ్జెట్తో టి-సిరీస్ ఫిలింస్ , రెట్రో ఫైల్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. దాదాపు 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని కేవలం ఒక ఫారెస్ట్ సీన్ కోసం ఏకంగా 60కోట్లు ఖర్చుపెట్టారట. ఈ చిత్రాన్ని 15 భాషలల్లో పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. దానికి తగ్గట్టే క్వాలిటి కంటెంట్ కోసం అంతమొత్తం ఖర్చు పెట్టారట. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా, కృతి సనన్ సీత పాత్రలో నటించింది. రావణసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీఖాన్ నటించాడు. ఈ చిత్రం అగస్టు 11న ప్రేక్షకులు ముందుకు రానుంది.