హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమ స్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల పథకం వేగవంతంగా, పారదర్శకంగా అమలు చేయడానికి కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఇల్లు బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత సాంకేతిక కారణాలతో బిల్లులు రాని వారికి తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.