Patanjali | న్యూఢిల్లీ, జూలై 17: అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ రిపోర్ట్తో అతలాకుతలమైన గౌతమ్ అదానీ గ్రూప్లో భారీ పెట్టుబడులు చేసి తాత్కాలికంగా గట్టెక్కించిన విదేశీ ఫండ్ తాజాగా బాబా రామ్దేవ్ నేతృత్వంలోని పతంజలి ఫుడ్స్లో రూ.2,400 కోట్లు కుమ్మరిస్తున్నది. యూఎస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీక్యూజీ పార్టనర్స్.. పతంజలి ఫుడ్స్ జారీచేసిన ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)లో 5.96 శాతం వాటాను (2.15 కోట్ల షేర్లు) తీసుకోనుంది.
ఈ ఓఎఫ్ఎస్కు ఫ్లోర్ ధరగా షేరుకు రూ.1000గా నిర్ణయించగా, నాన్ రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.1, 103.80 ధరపై వాటాల్ని కేటాయిస్తారు. దీని ప్రకారం జీఎక్యూజీ పార్టనర్స్ పెట్టుబడి విలువ రూ. 2,400 కోట్లు అవుతుంది. ఓఎఫ్ఎస్లో నాన్-రిటైల్ ఇన్వెస్టర్లకు 7 శాతం వాటాను (2.28 కోట్ల షేర్లు) పతంజలి ఆఫర్ చేసింది. ఈ ఆఫర్కే జీక్యూజీ బిడ్స్ సమర్పించింది. సోమవారం పతంజలి ఫుడ్స్ షేరు 2 శాతంపైగా పెరిగి రూ. 1,275 వద్ద ముగిసింది.