పీర్జాదిగూడ, నవంబర్ 16 : పీర్జాదిగూడ పరిధిలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని మేయర్ జక్క వెంకట్రెడ్డి విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతనంగా చేపడుతున్న భవన నిర్మాణాల సమయంలో కరెంట్ బిల్లులు అధికంగా రావడం, కేటగిరిలపై విజిలెన్స్ కేసు నమోదు చేయడంపై బిల్డర్లు, విద్యుత్ అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ చౌర్యం కేసు బుక్ చేసి ఫెనాల్టీ, డెవలమెంట్ చార్జీలు, విజిలెన్స్ కేసులు, ట్రాన్స్ఫార్మర్ అప్లికేషన్, కమర్షియల్ మీటర్లు, ఇతర సమస్యల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కరెంట్ స్తంభాలకు దరఖాస్తు చేసుకుంటే 9మీటర్ల స్తంభాలు, 3ఫేజ్ విద్యుత్ ఏర్పాటు చేయాలని, ట్రాన్స్ఫార్మర్లకు దరఖాస్తులు చేసుకుంటే 3ఫేజ్ కరెంట్తో పాటు స్ట్రీట్లైట్ ఫేజ్ లైన్లు వేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ రామకృష్ణారావు, ఏడీఈ శ్రీనివాస్, విద్యుత్ ఏడీఈ శ్రీనివాస్రెడ్డి, కార్పొరేటర్లు హరిశంకర్రెడ్డి, అనంతరెడ్డి, ఏఈ రాంరెడ్డి వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఏఈ వినీల్ పాల్గొన్నారు.