విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. సోమవారం రాత్రి స్పీకర్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపోండి, నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించేది లేదు.. విచారణ చేయించి నేనే కఠిన చర్యలకు సిఫారసు చేస్తా’ అని హెచ్చరించారు.
-బాన్సువాడ రూరల్