చిరంజీవి, రామ్చరణ్ కథానాయకులుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిరంజన్రెడ్డి, అన్వేష్రెడ్డి నిర్మించారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 23న హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇటీవల విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన లభిస్తున్నది. అందరి అంచనాల్ని అందు కునేలా ఈ సినిమాను తెరకెక్కించాం. మెగాభిమానులకు ఓ పండగలా ఉం టుంది. ప్రీరిలీజ్ వేడుకను భారీ స్థాయిలో నిర్వహించబోతున్నాం’ అని తెలిపారు. ఈ నెల 29న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. దేవుడి మాన్యాల అన్యాక్రాంతం, వాటిని పరి రక్షించేందుకు చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా సమాచారం. ఇందులో ఆచార్యుడిగా, నక్సలైట్గా రెండు భిన్న పార్శాలున్న పాత్రలో చిరంజీవి కనిపించనున్నారు. ఆయనకు అండగా నిలిచే సిద్ధ పాత్రను రామ్చరణ్ పోషిస్తున్నారు. మణిశర్మ స్వరకర్త. కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు.