అచ్చంపేట: అచ్చంపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన సంతకు ప్రభుత్వం స్థలం ఇప్పించడంతో పాటు మౌళిక వసతుల కల్ప నకు తన నిధుల నుంచి రూ. 10 లక్షలు మంజూరు చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శని వారం అచ్చంపేట అటవీశాఖ కార్యాలయం సమీపంలో మున్సిపల్ ఆధ్వర్యంలో నూతనంగా మొదటిసారి ఏర్పాటు చేసిన మేకలు, గొర్రెలు, పశువుల సంతను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రారంభించారు.
అనంతరం మున్సిపల్ చైర్మెన్ నర్సింహాగౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంత శాశ్వతంగా జరుగాలంటే దళారీ వ్యవస్థ నిర్మూలించడంతో పాటు రైతులకు విశ్వాసం కల్గించే విధంగా వ్యాపారం జరుగాలని సూచించా రు. సంత జరిగే ప్రతి శనివారం నాడు వివిధ ప్రాంతాలలో ఆరుగురు పోలీసులను పర్యవేక్షణ కోసం నియమించాలని, ఎలాంటి ఆటంకాలు జరుగకుండా మున్సిపల్ అధికారులు, కౌన్సిల్ సభ్యులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ప్రభుత్వ స్థలం కల్పించే విధంగా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని వసతుల కోసం పది లక్షలు కేటాయిస్తా నన్నారు. సంత జీవితాంతం కొనసాగేవిధంగా చూడాలని మంచి ఆలోచనతో సంతను ఏర్పాటు చేయడం పట్ల అభినందిం చారు. సీఎం కేసిఆర్ కుల వృత్తులను ప్రోత్సహించేవిధంగా ముందుచూపుతో వృత్తులవారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
ఈ ప్రాంతంలోని కులవృత్తుల వారికి అటవీవాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు తలపెట్టరాదని అన్నారు. కులవృత్తుల ఆర్థిక మూలాలు దెబ్బతీసే విధంగా కొన్నిశాఖలు వ్యవహరించడం, కేసులు పెట్టడం సరైందికాదన్నారు. సంతకు వచ్చి అమ్మకాలు, కొనుగోలు చేసే వారి మధ్య దళారీ వ్యవస్థ లేకుండా చూడాలని సూచించారు. నల్లమల ప్రాంతంలోని తూరుపు పొడజాతి పశువులకు రాష్ట్రంలో మంచి పేరు, డిమాండ్ ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటివలనే రాష్ట్ర జంతువుగా ప్రకటించిందన్నారు.
సంత మరింత అభివృద్ధి జరిగేవిధంగా వసతుల కల్పనకు ఇతర ప్రాంతాలలో జరిగే సంతలను చూసి రావాలని సూచిం చారు. సీఎం కేసిఆర్ పోడు భూములకు తొందరలోనే పరిష్కారం చూపుతారన్నారు. గత ప్రభుత్వాలు 2005 వరకే సాగులో ఉన్నవారికి హక్కులు వర్తించేవిధంగా చట్టాలు చేశారని ఈ చట్టం అమలు చేస్తే రైతులు నష్టపోతారన్నారు.
చట్టాన్ని మార్చి రైతులకు వెసులుబాటు కల్పించేవిధంగా కొత్తచట్టం తీసుకువచ్చి సాగుచేసేరైతులకు హక్కులు కల్పించే విధంగా తీర్మాణం చేసి కేంద్రానికి పంపించే విధంగా సీఎం కేసిఆర్ ఆలోచిస్తున్నారని అన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన సంతలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు రూ. 8వేలు చెల్లించి ఆవును మొదటి కొనుగోలు చేసి రైతులు, వ్యాపారస్తులను ఉత్సాహపరిచారు. సంతలో పర్యటించి వచ్చిన రైతులు, వ్యాపారస్తులతో మాట్లాడారు. సంతకు కొద్దిదూరం నుంచి ఎద్దులబండిపై వచ్చి ఆకట్టుకున్నారు.
కార్యక్రమంలో జిల్లా రైతు సమితి అధ్యక్షులు పోకల మనోహర్, మార్కెట్ చైర్మెన్ సీఎంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్ శైలజారెడ్డి, ఎంపీపీ శాంతబాయి, బిక్యనాయక్, జెడ్పీటీసీలు మంత్రియానాయక్, రాంబాబు, ప్రతాప్రెడ్డి, తులసిరాం, పర్వతాలు, గోపాల్రెడ్డి, రాజేశ్వర్రెడ్డి, మున్సిపల్ కమీషనర్ శ్రీహరిరాజు, కౌన్సిలర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.