తిరుమలగిరి: దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళిత బాంధవుడు అభినవ అంబేద్కర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని తుంగుతర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. దళిత బంధు ఫైలట్ ప్రాజెక్టుకు తిరుమలగిరి మండలం ఎంపిక కావటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తిరుమలగిరి తెలంగాణ చౌరస్తాలో డాక్టర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహలకు పూల మాలలు వేశారు. అనంతరం పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత బంధు పథకం కింద తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోని రాష్ట్రం లోని 4 దిక్కుల నుంచి 4 మండలాలు ఎం పిక చేసింది. దీనితో భాగంగా రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ బాగాల్లో మండలాలను దళిత బంధు కింద ఎంపిక చేసింది. ఇందులో తిరుమలగిరి మండలం ఎంపిక కావటం హర్షణీయ మన్నారు. మండలంలో సుమారు 2500 కుటుంబాలకు దళిత బంధు కింద లబ్ధి చేకూరుతుందన్నారు. దళితులు ఈ పథకంతో జీవనోపాధి పొందటమే కాకుండా ఆర్థికంగా బలపడుతారన్నారు. వ్యాపార పంరంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు.
పది లక్షల రూపాలయతో ఆటోలు, ట్రాలీలు, మినీ డైరీ ఫాంలు, చిరు వ్యాపారాలు చేసుకోని జీవనోపాధి పొందే అవకా శాలు ఉంటాయన్నారు. సీఎం కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టిన ఒక నిబద్దతతో కొనసాగిస్తారని దీనికి ఉదాహరణ రైతు బం ధు, రైతుభీమా, మిషన్ భగీరథ లాంటివి మచ్చుతునకలుగా చెప్పవచ్చన్నారు. ముఖ్యమంత్రి పాలన దేశానికే ఆదర్శ మని, దళితులకు వెన్నుదన్నుగా నిలిచిన మహనుభావుడు కేసీఆర్ అని అన్నారు.
గతంలో ఏ ముఖ్యమంత్రి దళితుల కోసం ఇంతగా ఆలోచన చేయలేదని అన్నారు. దళితల పాలిట అభినవ అంబేద్కర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమానికి ముందు చౌరస్తాలో పెద్ద ఎత్తున టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు రఘునందన్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ అశోక్రెడ్డి, జడ్పీటీసీ అంజలి, మున్సిపల్ కౌనిలర్లు , టీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు , దళిత నాయకులు పాల్గొన్నారు.