హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): నగర శివారులోని అబ్దుల్లాపూర్మెట్ జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. ఈ హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల దర్యాప్తులో తేటతెల్లమైంది. జ్యోతి, యశ్వంత్ల మధ్య వివాహేతర సంబంధం భర్త శ్రీనివాస్రావు వారిద్దరిని అంతమొందించేందుకు ఉసిగొల్పిందని పోలీసులు ఆధారాలు సేకరించారు. గతంలో ఈ విషయమై భర్త శ్రీనివాస్రావు ఇద్దరినీ వారించినా మార్పురాకపోవడంతో కక్ష పెంచుకున్నాడు.
ఆదివారం జ్యోతి, యశ్వంత్ బయటికెళ్లడం చూసి వెంబడించిన భర్త శ్రీనివాస్ అవకాశం చూసుకుని ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని తెలుస్తున్నది. మంగళవారం మధ్యాహ్నం అబ్దుల్లాపూర్మెట్ పోలీసుస్టేషన్ పరిధి కొత్తగూడెం బ్రిడ్జి వద్ద వారాసిగూడకు చెందిన యశ్వంత్, మెట్టుగూడకు చెందిన జ్యోతి మృతదేహలు కనపడ్డాయి. అప్పుడు వీరు హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రే హత్య జరిగినట్టు పోలీసులు ప్రా థమిక నిర్థారణకు వచ్చారు. జ్యోతి భర్త శ్రీనివాస్రావు పోలీసుల అదుపులో ఉన్నాడు.