హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి(Yadadri bhuvanagiri) జిల్లా బొమ్మలరామారం మండలం రామలింగాలపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం(Love marriage,) చేసుకున్నాడని అజయ్ అనే యువకున్ని అమ్మాయి బంధువులు కత్తితో పొడిచిన, కళ్లలో కారం కొట్టి దాడికి పాల్పడ్డారు.
అజయ్ చనిపోయాడకుని దుండగులు వదిలేసి వెళ్లారు. గమనించిన స్థానికులు బాధితుడిని హాస్పిటల్కు తరలించారు. అజయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.