న్యూఢిల్లీ: తెలుగు యువ ఆర్చర్ వెన్నెం జ్యోతి సురేఖ కెరీర్లో కీలక మలుపు. అంతర్జాతీయ టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ పతకాలు కొల్లగొడుతున్న సురేఖ.. ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్లో నాలుగో ర్యాంక్కు చేరుకుంది. సోమవారం ప్రపంచ ఆర్చరీ ఫెడరేషన్ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ను అందుకుంది. కాంపౌండ్ విభాగంలో నాలుగో స్థానానికి చేరుకున్న తొలి భారత ఆర్చర్గా ఈ తెలుగు తేజం నిలిచింది. ప్రస్తుతం ఆసియా ర్యాంకింగ్స్లో సురేఖ నంబర్వన్ ర్యాంక్లో కొనసాగుతున్నది.