హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు లభించింది. శనివారం టీటీడీ పాలకమండలి సమావేశంలో సంస్థ ప్రతినిధులు ప్రశంసాపత్రాన్ని అంద జేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లా డుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపం చంలో ఎక్కడా లేని విధంగా భక్తులకు సేవలు, సదుపాయాలు కల్పిస్తున్నదని చెప్పారు. తిరుమలకు 60 నుంచి 70 వేల మంది భక్తులు వచ్చినా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి, దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. క్యూ లైన్లు శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తున్నామని, శుచి, శుభ్రతతో రోజుకు 3.5 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నట్టు వెల్లడించారు.