ఖాట్మండు, సెప్టెంబర్ 8: పతంజలి ఆయుర్వేద, ఐఎంఈ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరింది.
దేశవ్యాప్తంగా ఉన్న పతంజలి ఆయుర్వేద ఔట్లెట్ల ద్వారా నేపాలీలు తమ దేశానికి సులువుగా నగదును పంపించుకోవడానికే ఈ అగ్రిమెంట్ అని పతంజలి ఆయుర్వేద తెలిపింది. నేపాల్లోని ఐఎంఈ ఏజెంట్ల ద్వారాగానీ, ఐఎంఈపే మొబైల్ వ్యాలెట్ లేదా బ్యాంక్ ఖాతాల ద్వారా నగదును తీసుకోవచ్చని ఓ ప్రకటనలో పతంజలి ఆయుర్వేద తెలియజేసింది.