దేవరుప్పుల, ఆగస్టు 9 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జనగామ జిల్లా దేవరుప్పులకు చెందిన తుడిమిళ్ల మహేంద్రాచారి బియ్యం గింజ సైజులో బంగారంతో త్రివర్ణ పతాకాన్ని తయారుచేశారు.
50 మిల్లీ గ్రాముల బంగారంతో జాతీయ జెండాతోపాటు జెండా కర్రను తయారు చేసి మంగళవారం ప్రదర్శించారు. ఇందుకోసం సుమారు రెండున్నర గంటలపాటు శ్రమించినట్టు ఆయన పేర్కొన్నారు.