Sruthi Chakravarthi | మిసెస్ ఇండియా- 2024 అందాల పోటీల్లో హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రుతి చక్రవర్తి సత్తా చాటింది. భారత్24 సమర్పణలో ఈ నెల (ఏప్రిల్) 16వ తేదీన రాజస్థాన్లోని జైపూర్లో గ్లామానంద్ గ్రూప్.. మిసెస్ ఇండియా-2024 అందాల పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ అందాల పోటీల్లో పాల్గోన్న శ్రుతి చక్రవర్తి మొదటి రన్నరప్గా నిలిచి సత్తా చాటింది. 20 మంది కంటెస్టెంట్స్ తో పోటీపడిన శ్రుతి చక్రవర్తి తన అందం, ఆకర్షణతో అందరి హృదయాలను గెలుచుకుంది. ఇక పోటీల అనంతరం.. శ్రుతి చక్రవర్తి హైదరాబాద్కు తిరిగిరగా..ఈ క్రమంలో ఆమెను ఘనమైన స్వాగతం వచ్చింది