నీలగిరి, నవంబర్ 9: పెండ్లి చేసుకుంటానని మాయమాటలతో మహిళలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని నల్లగొండ పోలీసు లు మంగళవారం అరెస్టు చేశారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. గుండెపోటు డ్రామా ఆడాడు. పోలీసులు ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్య పరీక్షలు చేయించి, అంతా సక్రమంగా ఉండటంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నల్లగొండ క్లాక్టవర్ సెంటర్లోని చర్చిలో తులకొప్పుల శామ్యూల్ విలియమ్స్ పియానో వాయిస్తూ పాటలు పాడుతుంటాడు. దాంతోపాటు వైఎంసీఏ స్వచ్ఛంద సంస్థనూ స్థాపించాడు. కు టుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటున్న పట్టణంలోని శ్రీనివాస్నగర్కు చెందిన ఓ మహిళకు విలియమ్స్తో పరిచ యం ఏర్పడింది. అండగా ఉంటానని నమ్మించిన విలియమ్స్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తూ 9 ఏండ్లుగా ఆమెతోనే సహజీవనం చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఇల్లు కట్టిస్తానని బాధితురాలి వద్ద రూ.20 లక్షలు తీసుకున్నాడు. ఇదిలావుండగా చర్చికి వచ్చే ఓ యువతికి వైఎంసీఏలో ఉద్యోగం ఇస్తానని లోబర్చుకుని ఆరు నెలలుగా ఆమెతో ఉంటున్నాడు. గత నెల 25న ఆమెను వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్నగర్కు చెందిన మహిళ గత నెల 31న విలియమ్స్ను నిలదీసింది. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమెపై కత్తితో దాడికి యత్నించాడు. తప్పిం చు కున్న ఆమె డయల్ 100కు ఫోన్ చేసింది. పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వెనుక నుంచి గోడ దూకి పారిపోయాడు. మరుసటి రోజు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకునేందుకు అంగీకరించి.. వాయిదాలు వేస్తుండటం తో ఈనెల 5న బాధితురాలు వన్టౌన్ పోలీసులకు ఫిర్యా దు చేసింది. పోలీసుల విచారణలో విలియమ్స్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నల్లగొండ ఉమ్మడి జిల్లాతోపాటు విదేశాల్లోని పలువురు మహిళలతో నిందితుడికి సంబంధాలున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
గుండెపోటు పేరుతో హైడ్రామా..
సోమవారం రాత్రి పోలీసులు విలియమ్స్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా గుండెపోటు వచ్చిందని పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. మంగళవారం ఉదయం పోలీసులు అతడిని ప్రభుత్వ దవాఖానకు తరలించి పరీక్షలు చేయించగా.. అన్నీ నార్మల్గా వచ్చాయి. దీంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.