మొయినాబాద్, జనవరి 1: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. భారీగా భక్తులు వస్తారని భావించిన ఆలయ నిర్వాహకులు ప్రతి ఏడాది మాదిరిగానే ఏర్పాట్లు చేశారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఉదయం 4 గంటల నుంచే భక్తులు ఆలయానికి రావడం ప్రారంభించారు. మొయినాబాద్ ఇన్స్పెక్టర్ డీకే లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 100 మంది పోలీసు సిబ్బందితో ఆలయం వద్ద బందోబస్తు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయంలో రెండు దారులను ఏర్పాటు చేశారు. బందోబస్తు నిర్వహించిన పోలీసులు, గ్రామ పంచాయతీ పాలకవర్గానికి , సిబ్బందికి ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.