మాదాపూర్, నవంబర్ 22: వస్ర్తాలు, ఆభరణాలు, గృహోపకరణ వస్తువుల ప్రదర్శన నగర యువతను విశేషంగా ఆకట్టుకునేందుకు వచ్చాయి. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో సోమవారం ఏర్పాటు చేసిన హై లైఫ్ ఎగ్జిబిషన్ ప్రముఖ డిజైనర్లచే రూపొందించిన ప్రదర్శనకు ముఖ్య అతిథిగా నటి ఐశ్వర్య వుల్లింగాల, మిస్ ఇండియా ఒడి షా 2020 సుభ శ్రీ రాయగూరులు విచ్చేసి పలువురిని అలరించారు. ప్రముఖ మోడల్స్, నిర్వాహకుడు డోమినిక్తో కలిసి ప్రదర్శనకు జ్యో తి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇందులో నాణ్యమైన మన్నికైన ఆభరణాలు, వస్ర్తాలు, గృహోపకరణ ఉత్పత్తులను ప్రదర్శించినట్లు నిర్వాహకుడు తెలిపారు. అనంతరం, కార్యక్రమానికి విచ్చేసిన నటి ఐశ్వర్య, మోడల్స్తో కలిసి సెల్ఫీలు దిగుతూ సందడి చేసింది.