అమరావతి : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 480 మంది చికిత్సకు కోలుకున్నారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 9,00,805 కు చేరింది. 8,86,978 మంది చికిత్సకు కోలుకున్నారు. 6,614 యాక్టివ్ కేసులుండగా.. 7213 మంది మృత్యువాడపడ్డారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 30,851 శ్యాంపిళ్లను పరీక్షించారు.