అంబర్పేట : మొదటి దశ పనుల కింద నాలాల అభివృద్ధి కోసం రూ.858 కోట్లు విడుదల చేశామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హుస్సేన్సాగర్ వరదనీటి నాలాకు రక్షణ గోడ నిర్మాణానికి నల్లకుంట రత్నానగర్ వద్దభాగంగా రక్షణగోడ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సికింద్రాబాద్ జోన్లో రూ.163 కోట్లతో, కూకట్పల్లి జోన్లో రూ.112 కోట్ల 80 లక్షలు, ఎల్బీనగర్ జోన్లో 113.59 కోట్లతో, ఖైరతాబాద్ జోన్లో రూ.100.26 కోట్లతో, చార్మినార్ జోన్లో రూ.85. 61 కోట్లతో, శేరిలింగంపల్లి జోన్లో రూ.57.74 కోట్లతో, మొత్తం రూ.633 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ పరిధిలో నాలాల అభివృద్ధి చేస్తామని తెలిపారు.
నగర శివార్లలోని మున్సిపాలిటీల్లో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్కు రూ.45.62 కోట్లు, బడంగ్పేట మున్సిపాలిటీలో రూ.23.94 కోట్లు, జల్పల్లిలో రూ.24.85 కోట్లు, పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలో రూ.32.42 కోట్లు, నిజాంపేట మున్సిపల్కార్పొరేషన్ పరిధిలో రూ.84.63 కోట్లు, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.13.86 కోట్లతో నాలాల విస్తరణ చేస్తున్నామని చెప్పారు. స్సేన్సాగర్ వరదనీటి నాలా రక్షణగోడ నిర్మాణానికి రూ.68.40 కోట్లు విడుదల చేశామన్నారు.