తుమకూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడటంతో 8 మంది మరణించారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన శనివారం తుమకూరు జిల్లాలోని పావగడ సమీపంలో చోటుచేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. బస్సులో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉన్నారని స్థానికులు తెలిపారు.