హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారిని దర్శించుకొనే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో వెంకన్నస్వామి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. అక్టోబర్ నెలలో 8,12,818 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొన్నారు. 3,77,970 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.79.10 కోట్ల ఆదాయం లభించింది.