హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): గొర్రెలు, చేపల పంపిణీ పథకాల ద్వారా రాష్ట్రంలోని సుమా రు 70 లక్షల మందికి ఉపాధి లభిస్తున్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపా రు. రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు కేటాయించిందని, మిగిలిన నిధులను ఎన్సీడీసీ ద్వారా రుణంగా పొందనున్నట్టు చెప్పారు. మా ర్కెట్లో గొర్రెల ధరలు పెరగడంతో యూనిట్ ధరను రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచినట్టు వెల్లడించారు. శుక్రవారం శాసనసభలో పశు సంవర్ధకశాఖ పద్దుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ… గొర్రెల సంఖ్యలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని చెప్పా రు. కులవృత్తులను పరిరక్షించడం తో పాటు వాటిపై ఆధారపడిన వారిని ఆర్థికంగా నిలబెట్టాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకాలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. చేపల పెంపకంలో తెలంగాణకు బెస్ట్ ఇన్ల్యాండ్ అవార్డును కేంద్రం అందజేసిందని గుర్తుచేశారు. వాణిజ్య పన్నులశాఖ పద్దుపై మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర ఆదాయం పెంచేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకొంటున్నదని తెలిపారు. చిరు వ్యాపారులను ఎక్కడా ఇబ్బంది పెట్టలేదని, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించినట్టు పేర్కొన్నారు.