అమరావతి: వైరస్ సోకి నెమళ్లు చనిపోయాయి. చిత్తూరు జిల్లా సోమల మండలం మిట్టపల్లె సమీపంలోని పూలకొండ వ్యవసాయ పొలాల్లో 7 నెమళ్లు మృతిచెందాయి. వీటిని గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పశువైద్య సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని నెమళ్లను పరిశీలించారు.
అనంతరం మృతి చెందిన నెమళ్లకు పశువైద్యులు పోస్టుమార్టం నిర్వహించగా, నెమళ్ల కళేబరాల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నట్లుగా గుర్తించారు. గాలి ద్వారా సోకిన వైరస్ వల్లే నెమళ్లు చనిపోయాయని పశువైద్యాధికారులు స్పష్టం చేశారు.