యాదాద్రి, మార్చి 10 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దర్శనానికి వచ్చే వీవీఐపీల విడిది కోసం దాతల సహకారంతో నిర్మించిన ప్రెసిడెన్షియల్ విల్లాకు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన కాటూరి వైద్య కళాశాల యాజమాన్యం భూరీ విరాళం సమర్పించింది. ప్రెసిడెన్షియల్ సూట్లో నిర్మించిన విల్లా నిమిత్తం కాటూరి వైద్య కళాశాల అధినేత కాటూరి సుబ్బారావు రూ.7.5 కోట్ల విరాళం అందజేశారు. గురువారం యాదాద్రిలో ఆలయ ఈవోకు చెక్కు అందజేయగా.. కేటాయించిన విల్లాకు సంబంధించిన తాళం చెవిని ఈవో గీత, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు దాతకు అందజేశారు. ఇప్పటివరకు ప్రెసిడెన్షియల్ సూట్లో 14 విల్లాలను నిర్మించగా.. 13 విల్లాలను దాతలకు కేటాయించినట్టు తెలిపారు. మిగిలిన ఒక విల్లాను కాటూరి వైద్య కళాశాల యాజమాన్యానికి కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి విరాళాలు కొనసాగుతున్నా యి. భువనగిరి మండలం వడాయిగూడేనికి చెందిన వ్యాపారవేత్త ముద్దసాని వెంకటేశ్గౌడ్ గురువారం రూ.55 వేల విరాళం సమర్పించారు. బాలాలయంలో అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ప్రధానార్చకుడు నల్లన్థీఘల్ లక్ష్మీనరసింహాచార్యులుకు చెక్కు అందజేశారు. కాగా హైదరాబాద్కు చెందిన కర్రె సంతోష్కుమార్ రూ.55 వేల విరాళం చెక్కును ఏఈవో గజవెల్లి రమేశ్బాబుకు అందజేశారు.