వేములవాడటౌన్, మే 12: వేములవాడ శ్రీరాజరాజేశ్వరి అమ్మవారికి సిరిసిల్లకు చెందిన శ్రీరాజరాజేశ్వరి సేవాసమితి, హైదరాబాద్కు చెందిన ఏజేఆర్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా రూ. 6 లక్షల విలువైన కిరీటాన్ని బహూకరించాయి. రాగిపూతపై బంగారు తాపడంతో చేసిన కిరీటాన్ని గురువారం లలితాపరమేశ్వరి పీఠాధిపతి చేతులమీదుగా ఆలయ అధికారులకు అందజేశారు. ఈసందర్భంగా ఆలయ ఓపెన్స్లాబ్పై ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు కిరీటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.