ట్రిపుల్ ఐటీ -సీఐఈలో స్టార్టప్ కార్యకలాపాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ -సీఐఈ ఇంక్యుబేటర్లోని ఆవిష్కార్ యాక్సలరేటర్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్స్టోరీడ్ స్టార్టప్కు రూ.59 కోట్ల ఫండింగ్ సమకూరింది. ఎమర్జింగ్ టెక్నాలజీస్ల్లో ఒకటైన కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్-ఏఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సేవలందించే ఈ స్టార్టప్ను షర్మీన్ అలీ స్థాపించారు. పెద్దమొత్తంలో ఫండ్ సమకూరడం చాలా ఆనందంగా ఉందని సీఐఈ ప్రతినిధి రమేశ్ లోక్నాథన్ తెలిపారు. గతంలో రెండుసార్లు తక్కువ మొత్తంలో నిధులు సమకూరాయి. ఈసారి 59 కోట్ల వరకు నిధులను ప్రిట్, 9యూనికార్న్ సంస్థలు సమకూర్చాయి. ఈ నిధులతో ఇన్స్టోరీడ్ స్టార్టప్ కార్యకలాపాలు మరింత వేగంగా, దేశ విదేశాల్లో చేపట్టేందుకు అవకాశం కలుగనున్నది.