న్యూఢిల్లీ: తుఫాన్లు, వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తుల వల్ల దెబ్బతినే ముప్పు అస్సాం, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ర్టాలకు చాలా ఎక్కువని తాజా నివేదిక వెల్లడించింది. దేశంలోని 463 జిల్లాలు తీవ్ర వరదలు, కరువు, తుఫాన్లు ఎదుర్కొనే విషయంలో దుర్భలంగా ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీకి చెందిన సీఈఈడబ్ల్యూ అనే సంస్థ ‘ైక్లెమేట్ వల్నరబిలిటీ ఇండెక్స్’ను విడుదల చేసింది. దేశంలోని 80 శాతం జనాభా ప్రకృతి విపత్తుల ముప్పు వల్ల తీవ్ర హాని జరిగే జిల్లాల్లోనే నివసిస్తున్నారని వివరించింది.