NR Narayana Murthy | ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ఐదు నెలల మనుమడు ఏకగ్రహ్ రోహన్ మూర్తి పంట పండింది. ఇటీవలే తన మనుమడికి నారాయణ మూర్తి.. సంస్థలో 15 లక్షల షేర్లను కానుకగా ఇచ్చేశారు. ఇప్పుడు ఏకగ్రహ్ రోహన్ మూర్తికి ఆ 15 లక్షల షేర్లే రూ.4.20 కోట్లు సంపాదించి పెట్టాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించిన ఇన్పోసిస్ యాజమాన్యం.. ఒక్కో షేర్పై ఫైనల్ అండ్ స్పెషల్ డివిడెండ్ రూ.28 ప్రకటించింది. డివిడెండ్, స్పెషల్ డివిడెండ్కు ఆమోదం తెలిపేందుకు వచ్చేనెల 31న ఇన్ఫోసిస్ వార్షిక వాటాదారుల సమావేశం జరుగుతుంది. జూలై ఒకటో తేదీ నుంచి డివిడెండ్ చెల్లింపులు జరుగుతాయని ఇన్ఫీ తెలిపింది.
నారాయణమూర్తి కానుకగా ఇచ్చిన 15 లక్షల షేర్లపై రోహన్మూర్తికి రూ.240 కోట్ల ఆస్తి కలిగింది. ఇది దేశంలోని ఐటీ దిగ్గజాల్లో ఒక్కటిగా నిలిచిన ఇన్ఫీలో యువ మిలియనీర్ వాటాదారుడిగా మార్చేసింది. తాజాగా ఇన్ఫీ ప్రకటించిన ఫైనల్, స్పెషల్ డివిడెండ్ కలుపుకుంటే రోహన్ మూర్తికి రూ.4.2 కోట్ల లాభం వచ్చింది. నారాయణ మూర్తి కొడుకు రోహన్ మూర్తి- అపర్ణ కృష్ణన్ దంపతుల కొడుకే ఏకగ్రహ్ రోహన్ మూర్తి. నారాయణ మూర్తికి ఏకగ్రహ్ మూడో మనుమడు. అక్షతామూర్తి- బ్రిటన్ ప్రధాని రిషి సునక్ దంపతుల ఇద్దరు కూతుళ్లు నారాయణ మూర్తి ఇద్దరు మనుమలు.