మారేడ్పల్లి, నవంబర్ 12 : రైలులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి రూ.8.40లక్షల విలువచేసే 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రైల్వే డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ చంద్రభాను, ఇన్స్పెక్టర్ శ్రీను వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా గొలంతార గ్రామానికి చెందిన బెహరా (40) ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైల్లో ఏపీ నుంచి ముంబైకి గంజాయిని తరలిస్తున్నాడు. సికింద్రాబాద్లో దిగిన బెహరా అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా బ్యాగులో 42 కిలోల గంజాయి పట్టుపడింది. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.