లక్నో: ఉత్తరప్రదేశ్లో డెంగీ కలకలం సృష్టించింది. ప్రయాగ్రాజ్లో ఏకంగా 41 మందికి డెండీ సోకింది. వారిలో 36 మంది పెద్దవాళ్లు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. బాధితులందరినీ స్థానికంగా ఉన్న తేజ్ బహదూర్ సప్రూ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు యూపీ ఆరోగ్య విభాగం అధికారులు తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలే తాజాగా డెంగీ విజృంభణకు కారణమని చెప్పారు.
ప్రయాగ్రాజ్లో రోజురోజుకూ కొత్తగా నమోదవుతున్న డెంగీ కేసుల సంఖ్య అంతకంతకే పెరుగుతున్నదని యూపీ ఆరోగ్య విభాగం అధికారులు చెప్పారు. పరిస్థితిని అదుపు చేయడం కోసం స్థానిక అధికార యంత్రాంగం ఫాగింగ్, క్లీనింగ్ లాంటి కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు.