ముంబై, డిసెంబర్ 28: బ్యాంకింగ్ మోసాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం, అటు రిజర్వు బ్యాంక్లు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 4 వేలకు పైగా బ్యాంకింగ్ మోసాలు జరిగాయి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో జరిగిన 3,499 మోసాలతో పోలిస్తే భారీగా పెరిగాయి. మోసాల సంఖ్య పెరిగినప్పటికీ వీటి విలువ మాత్రం భారీగా తగ్గడం విశేషం. గత ఆరు నెలల్లో బ్యాంకుల్లో రూ.36,342 కోట్ల మోసాలు జరిగాయి. ఏప్రిల్-సెప్టెంబర్ 2020లో రూ.64,261 కోట్లుగా ఉన్నది.