హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నలుగురు అధ్యాపకులకు గ్లోబల్ టాప్ 200 పరిశోధకుల జాబితాలో స్థానం దక్కింది. ఆయా రంగాల్లో టాప్ పరిశోధకుల జాబితాను అమెరికాకు చెందిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తాజాగా ప్రకటించింది. ఎంఎన్వీ ప్రసాద్ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్స్ విభాగంలో 102వ ర్యాంకు, స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీకి చెందిన అశ్విని నంగియాకు 121వ ర్యాంకు, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కు చెందిన డీఆర్ రావు 184వ ర్యాంకు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లిష్కు చెందిన ప్రమోద్ కే నాయర్కు 120వ ర్యాంకు వచ్చింది. ఇందులో ఎంఎన్వీ ప్రసాద్, ప్రమోద్ కే నాయర్ గతేడాది ర్యాంకులను మెరుగుపరుచుకున్నట్టు మంగళవారం హెచ్సీయూ ప్రకటించింది. గ్లోబల్ టాప్ 200లో పరిశోధకులుగా నిలిచిన అధ్యాపకులు, పరిశోధకులను హెచ్సీయూ వీసీ ప్రొఫెసర్ బీజే రావు మంగళవారం అభినందించారు.