అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు (Eluru) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని లింగపాలెం మండలం బోగోలులో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిడుగుపడింది. దీంతో నలుగురు కూలీలు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను విజయవాడలోని దవాఖానకు, మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. జామాయిల్ కర్రలు తొలగిస్తుండగా కూలీలపై పిడుగు పడినట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ 30 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు.