న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జైళ్లలో 2020 చివరినాటికి 4.83 లక్షల మంది మగ్గిపోతున్నారు. వీరిలో 76 శాతం అండర్ ట్రయల్ ఖైదీలేనని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో విడుదల చేసిన ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా 2020 నివేదికలో వెల్లడైంది. 23 (1.11 లక్షల మంది) శాతం మందిపై మాత్రమే నేర నిరూపణ అయ్యిందని నివేదిక పేర్కొంది. దేశంలో వివిధ జైళ్లలో 4,926 మంది విదేశీయులు కూడా ఖైదీలుగా ఉన్నారని తెలిపింది. బీజేపీ పాలిత రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్లోనే అత్యధికమంది అండర్ట్రయల్స్ జైళ్లలో మగ్గుతున్నారు.