డిండి, అక్టోబర్ 30 : మండలంలోని ఎర్రగుంటపల్లి గేట్ వద్ద శనివారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో పోలీసులు 20 కిలోల గంజాయిని పట్టుకున్నారు. మండలంలోని నగరాదుబ్బతండాకు చెందిన శ్రీకాంత్ నాయక్ విశాఖ పట్నం నుంచి గంజాయి తీసుకొచ్చి మహారాష్ట్రకు సరఫరా చేసేందుకు తన పల్సర్ బైక్పై బల్దేరాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఎర్రగుంటపల్లి గేట్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన అతడిని అదుపులోకి తీసుకొని బాగులో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎంపీడీఓ గిరిబాబు సమక్షంలో పంచనామా నిర్వహించారు. శ్రీకాంత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
నేరేడుగొమ్ములో రేషన్ బియ్యం..
నేరేడుగొమ్ము(చందంపేట): మండల కేంద్రంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని శనివారం పోలీసులు పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు వెళ్లి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఈ విషయమై సదరు ఇంటి యజమానిని విచారిస్తున్నట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు.