సిద్దిపేట: జిల్లాలోని చిన్నకోడూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ఇబ్రహీంనగర్ మేడిపల్లి ఎక్స్రోడ్డు వద్ద ప్రైవేటు బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మధ్యప్రదేశ్కు చెందిన కూలీలతోకూడిన బస్సు.. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. క్షతగాత్రులను రాంప్రసాద్, శాంతాభాయ్, గొంతి మాత్రేగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.