అమరావతి, నవంబర్ 13: మహారాష్ట్రలోని అమరావతి జిల్లా కేంద్రంలో ఇంటర్నెట్ సేవలను మూడు రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. నగరమంతా కర్ఫ్యూ విధించారు. త్రిపురలో మైనారిటీలపై దాడులను నిరసిస్తూ మహారాష్ట్రలో ముస్లిం సంస్థలు శుక్రవారం బంద్కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో అమరావతి, నాసిక్, నాందేడ్ జిల్లాల్లో నిర్వహించిన ర్యాలీల్లో రాళ్లు రువ్విన ఘటనలు చోటుచేసుకొన్నాయి. ముస్లింల ర్యాలీలను వ్యతిరేకిస్తూ శనివారం ఉదయం అమరావతిలో వందలాది మంది కాషాయ జెండాలు పట్టుకొని రాజ్కమల్ చౌక్ దగ్గర ప్రదర్శన నిర్వహించారు. అక్కడి షాపులపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి మరింత దిగజారకుండా అధికారులు కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ నిలిపివేశారు.