జగిత్యాల : ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా జగిత్యాలలో తొమ్మిదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. బెటాలియన్ ఎన్సీసీ ఆర్మీ అధికారులు సుబేదార్ రాజేశ్కుమార్, హవల్దార్ నిర్దోష్కుమార్ ఎన్సీసీ విద్యార్థులతో కలిసి స్థానిక వాణినగర్లోని గీత విద్యాలయం గ్రౌండ్ ఫిట్ ఇండియా.. ఫ్రీడమ్ 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ మారుతీ శ్రీహరిరావు, మౌంట్ కార్మెల్ పాఠశాల కేర్ టేకర్ సీహెచ్ మంగ, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల, రామకృష్ణ డిగ్రీ కళాశాలలకు చెందిన ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.